నల్గొండలో వైఎస్ షర్మిల దీక్ష: ప్రతి మంగళవారం నిరాహార దీక్ష

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:34 IST)
నల్గొండలో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. నల్గొండ కేంద్రంలోని క్లాక్​టవర్​ వద్ద వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల.. నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
తొలుత మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వద్ద మాట్లాడిన అనంతరం ... నిరాహారదీక్ష వేదికకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ప్రతి మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష వారం చేపడతానని షర్మిల వనపర్తి జిల్లా తాడిపత్రి పర్యటనలో చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ పర్యటనలో తెలిపారు. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్​తో ప్రతివారం ఒక్కో జిల్లాలో దీక్ష చేపడుతున్నారు. 
 
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ దీక్ష చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వారం నల్గొండ కేంద్రంలో దీక్ష చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments