Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో విషాదం.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:09 IST)
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. డాక్టర్ పూర్ణ చందర్(28) గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందారు. బుధవారం ఉదయం డాక్టర్ పూర్ణ చందర్ తన విధులు ముగించుకున్న అనంతరం గాంధీ ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి బయటకు వస్తుండగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది తక్షణమే ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయినప్పటికీ అతను వైద్యానికి సహకరించలేదు. గుండెపోటుతో పూర్ణ చందర్ మరణించినట్లు సీనియర్ వైద్యులు నిర్ధారించారు.
 
డాక్టర్ పూర్ణచందర్ జనరల్ సర్జరీలో ఇటీవలే సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం పూర్ణ చందర్ గాంధీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే డాక్టర్ పూర్ణ చందర్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తోటి జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఛాతీలో నొప్పి వస్తుందని, కడుపుంతా వికారంగా ఉన్నట్లు పూర్ణచందర్ తెలిపినట్లు జూడాలు పేర్కొన్నారు. అందుకోసం మెడిసిన్స్ వేసుకున్నాడని, బుధవారం మళ్లీ విధుల్లో చేరారని జూడాలు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments