Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు..

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (12:55 IST)
పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు. వివరాల్లోకి వెళితే.. యాద్రాద్రి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 12వ తేదీన పసికందుకు జన్మనిచ్చింది ఓ యువతి.. ఆ తర్వాత 10 రోజులకు పసికందును రూ. 60 వేలకు భువనగిరి శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర విక్రయించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా ఘట్‌కేసర్‌ మండలం ఎదులబాద్‌కు చెందిన వారికి అమ్మేశారు.
 
అసలు విషయం ఏంటంటే.. పెళ్లి కాకుండానే.. బిడ్డను జన్మనిచ్చింది ఆ యువతి.. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతం నివాసం ఉండే సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం ద్వారానే గర్భం దాల్చిన యువతి పసికందుకు జన్మనివ్వడం ఆ తర్వాత అమ్మేయడం జరిగిపోయాయి. 
 
కానీ, కేసు విచారణలో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తేవాలని కోరారు నేరేడ్‌మెట్ పోలీసులు.. దీంతో.. పాప చనిపోయిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు.. కాస్త గట్టిగా నిలదీయడంతో పోలీసుల విచారణలో పాపను విక్రయించినట్లు తెలిపారు. ఇక, ఈ ఘటనపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. పాపను చైల్డ్ కేర్ సెంటర్ తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments