Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు..

yadadri
Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (12:55 IST)
పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు. వివరాల్లోకి వెళితే.. యాద్రాద్రి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 12వ తేదీన పసికందుకు జన్మనిచ్చింది ఓ యువతి.. ఆ తర్వాత 10 రోజులకు పసికందును రూ. 60 వేలకు భువనగిరి శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర విక్రయించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా ఘట్‌కేసర్‌ మండలం ఎదులబాద్‌కు చెందిన వారికి అమ్మేశారు.
 
అసలు విషయం ఏంటంటే.. పెళ్లి కాకుండానే.. బిడ్డను జన్మనిచ్చింది ఆ యువతి.. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతం నివాసం ఉండే సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం ద్వారానే గర్భం దాల్చిన యువతి పసికందుకు జన్మనివ్వడం ఆ తర్వాత అమ్మేయడం జరిగిపోయాయి. 
 
కానీ, కేసు విచారణలో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తేవాలని కోరారు నేరేడ్‌మెట్ పోలీసులు.. దీంతో.. పాప చనిపోయిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు.. కాస్త గట్టిగా నిలదీయడంతో పోలీసుల విచారణలో పాపను విక్రయించినట్లు తెలిపారు. ఇక, ఈ ఘటనపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. పాపను చైల్డ్ కేర్ సెంటర్ తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments