Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తింటి వేధింపులు.. మనస్తాపంతో పురుగుల మందు సేవించి..?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (09:54 IST)
అత్తింటి వేధింపులకు ఓ యువతి బలైపోయింది. ఈ ఘటన జిల్లాలోని మోత్కూరు మండలం దత్తప్ప గూడెంలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతో నవిత(22) అనే యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన నవిత, పరశురాములు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఎంగేజ్మెంట్ ముందు రోజే పరుషరాములుతో నవిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆపై మార్చి4న ఆర్య సమాజ్‌లో ఇరువురు వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ క్రమంలో వారిని మంచిగా చూసుకుంటామంటూ పరుశరాములు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పి జంటను తీసుకెళ్లారు. అయితే గత కొద్దిరోజులుగా ఆదనపు కట్నం కోసం నవితను అత్తింటి వారు వేధింపులకు గురిచేశారు. 
 
రోజు రోజుకు వేధింపులు అధికమవడంతో తీవ్రమనస్తాపానికి గురైన నవిత రెండు రోజుల క్రితం పురుగుల మందు సేవించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవిత మృతి చెందింది. ఈ ఘటలనకు సంబంధించి 8 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వున్న అత్తింటివారిని గాలించే పనిలో పడ్డారు పోలీసులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments