అత్తింటి వేధింపులు.. మనస్తాపంతో పురుగుల మందు సేవించి..?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (09:54 IST)
అత్తింటి వేధింపులకు ఓ యువతి బలైపోయింది. ఈ ఘటన జిల్లాలోని మోత్కూరు మండలం దత్తప్ప గూడెంలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతో నవిత(22) అనే యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన నవిత, పరశురాములు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఎంగేజ్మెంట్ ముందు రోజే పరుషరాములుతో నవిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆపై మార్చి4న ఆర్య సమాజ్‌లో ఇరువురు వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ క్రమంలో వారిని మంచిగా చూసుకుంటామంటూ పరుశరాములు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పి జంటను తీసుకెళ్లారు. అయితే గత కొద్దిరోజులుగా ఆదనపు కట్నం కోసం నవితను అత్తింటి వారు వేధింపులకు గురిచేశారు. 
 
రోజు రోజుకు వేధింపులు అధికమవడంతో తీవ్రమనస్తాపానికి గురైన నవిత రెండు రోజుల క్రితం పురుగుల మందు సేవించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవిత మృతి చెందింది. ఈ ఘటలనకు సంబంధించి 8 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వున్న అత్తింటివారిని గాలించే పనిలో పడ్డారు పోలీసులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tollywood Exibitors war : ఎగ్జిబిటర్ల మధ్య వార్ - దిల్ రాజు మనుషులు బెదిరింపు !

Shruti Haasan: గ్రామస్తుల వింత పరిస్థితికి సింగ్ గీతం నుంచి ఏమైంది' సాంగ్

పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌త్యేక‌ పాట‌

Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్

Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం

తర్వాతి కథనం
Show comments