Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే ‌సౌండ్‌ ఎఫెక్ట్.. మహిళకు బ్రెయిన్ స్ట్రోక్‌ - మృతి

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (13:45 IST)
తెలంగాణా రాష్ట్రంలో డీజే సౌండ్ ఎఫెక్ట్‌కు మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ శబ్దం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. ఖమ్మం జిల్లాలోని నగర శివారు అల్లీపురంలో జరిగింది. 
 
మృతురాలి బంధువుల కథనం ప్రకారం... స్థానికంగా నివసించే పెనుగూరి రాణి(30) గురువారం చింతకాని మండలం సీతంపేటలో బంధువు వివాహ వేడుకలో కుటుంబంతో కలిసి పాల్గొంది. పెళ్లి కొడుకుతో తిరిగి ఇంటికి వస్తూ అల్లీపురంలో జరిగిన ఊరేగింపులో ఉత్సాహంగా నృత్యం చేసింది. 
 
ఈ క్రమంలో డీజే శబ్దానికి తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయిన ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. డీజే శబ్ధాల ధాటికి ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారని బంధువులు చెప్పారు. 
 
రాణి స్వగ్రామం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం. దివ్యాంగుడైన భర్త ఉప్పలయ్య, కుమార్తెలు అమూల్య, అంజలితో కలిసి తన పుట్టిల్లు అల్లీపురంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రాణి మృతితో కుమార్తెలు ఆదరవు కోల్పోయారని బంధువులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments