Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన భర్త

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (13:46 IST)
భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మూడు రోజులు ఇంట్లోని సంపులో భార్య మృతదేహాన్ని దాచి శవాన్ని మాయం చేసేందుకు విఫలయత్నం చేసి దొరికిపోయాడు. వివరాలు పరిశీలిస్తే షాజియాబేగం మియాపూర్ సమీపంలోని హఫీజ్ పేట్‌కు చెందిన తాజ్‌తో ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. 
 
ఈ దంపతులకు ముగ్గురు మగపిల్లలు సంతానం కలిగారు. వీరికి ఆరేళ్ల తహ, నాలుగేళ్ల తల్హా, రెండేళ్ల ఇబ్రహీంలు ఉన్నారు. ఇటీవల కాలంలో కాపురంలో కలతలు బయలేగాయి... భర్త తాజ్, అత్తింటివారంతా షాజియాను వేధింపులకు గురిచేసినా ఏనాడూ పుట్టింటివారికి చెప్పుకునేది కాదు ఈ ఇల్లాలు. శారీరకంగా, మానసికంగా హింసించినా ఓర్పుతో అన్నీ భరించింది షాజియా. 
 
మూడ్రోజుల క్రితం షాజియాబేగంపై కత్తులతో దాడి చేసి.. ఆమెని చంపి ఇంట్లోని నీళ్ల సంపులో పడేశారని ఆరోపిస్తున్నారు హతురాలి బంధువులు.నీళ్ల సంపులో ఉన్న షాజియాబేగం మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి.. పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. షాజియా బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షాజియాది హత్యా.. లేక ప్రమాదవశాత్తూ నీటిలో సంపులో పడి చనిపోయిందా అనేది వైద్యులిచ్చే పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని చెప్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments