వివాహేతర సంబంధానికి భర్త అడ్డు.. ప్రియుడితో కలిసి చంపేసింది..!

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (19:03 IST)
తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి, ముత్యాలు భార్యభర్తలు. అయితే నాగరాణి అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం ముత్యాలు (28) కు తెలిసి కదలించాడు. దాంతో తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన ఇరువురు ముత్యాలును హత్య చేయాలని పథకం పన్నారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 7న ముత్యాలు కూలి పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి ఇంట్లో నిద్రించాడు. అదే అదనుగా భావించిన నాగరాణి, నవీన్ లు ముత్యాలు మెడకు చున్నీ బిగించి హత్యచేశారు.

ఉదయం తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్టు ఒప్పుకొని పారిపోయింది.
 
దాంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో వారిని అరెస్టు చేస్తామని ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments