Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధానికి భర్త అడ్డు.. ప్రియుడితో కలిసి చంపేసింది..!

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (19:03 IST)
తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి, ముత్యాలు భార్యభర్తలు. అయితే నాగరాణి అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం ముత్యాలు (28) కు తెలిసి కదలించాడు. దాంతో తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన ఇరువురు ముత్యాలును హత్య చేయాలని పథకం పన్నారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 7న ముత్యాలు కూలి పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి ఇంట్లో నిద్రించాడు. అదే అదనుగా భావించిన నాగరాణి, నవీన్ లు ముత్యాలు మెడకు చున్నీ బిగించి హత్యచేశారు.

ఉదయం తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్టు ఒప్పుకొని పారిపోయింది.
 
దాంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో వారిని అరెస్టు చేస్తామని ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments