Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధింపుల కేసుపెట్టిన భార్య - ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:44 IST)
ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఒకరిని ఒకరు వేధించుకుంటున్నారు. తద్వారా తమ పచ్చని కాపురంలో నిప్పు రాజేసుకుంటున్నారు. తాజాగా పోలీస్ కానిస్టేబుల్ భార్య భర్తపై వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ కానిస్టేబుల్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీఎస్‌పీఎస్‌సీ కానిస్టేబుల్‌‌గా రాంబాబు అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్న రాంబాబుపై ఆయన భార్య వేధింపుల కేసు పెట్టింది.
 
ఒక యేడాది కాలంగా విధులకు వెళ్లకుండా తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో మనస్తాపంతోనే రాంబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments