Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీఆర్వో పరీక్ష రాయాలంటే తాళిబొట్టు తీయాలా?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వీఆర్వో రాత పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతర జిల్లాల అభ్యర్థులు హైదరాబాద్ రావడానికి సమయానికి బస్సులు ల

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (14:48 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వీఆర్వో రాత పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతర జిల్లాల అభ్యర్థులు హైదరాబాద్ రావడానికి సమయానికి బస్సులు లేకపోవడంతో అసహనానికి గురయ్యారు. ఇదిలాఉంటే పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళా అభ్యర్ధులు పట్ల మెదక్ జిల్లా నర్సాపూర్ లిటిల్ ప్లవర్ పాఠశాల యాజమాన్యం అనుచితంగా ప్రవర్తించింది.
 
పరీక్ష హాలులోకి అనుమతించాలంటే తాళిబొట్టు తీయాలని, మెట్టెలను ధరించవద్దని హుకుం జారీ చేసింది. దీంతో మహిళా అభ్యర్ధులు వాటిని తీసి తమ వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఇంకొందరు తాళిబొట్టు, మెట్టెలు తీయబోమనీ, ఇది తమ సంప్రదాయాలకు విరుద్ధమని పరీక్ష రాయకుండా వెనుదిరిగారు. పరీక్ష రాయడానికి వస్తే ఈ పిచ్చి నిబంధనలు ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
తాళిబొట్టు, మెట్టెలపై ఎటువంటి నిబంధనలు లేవని టీపీపీఎస్సీ గతంలో స్పష్టంగా ప్రకటించినా, సదరు పరీక్ష కేంద్రంలో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించామని, అయితే స్కూల్ యాజమాన్యానికి తెలియక ఇటువంటి పొరబాటు జరిగిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరక తగు చర్యలు తీసుకుంటాం అంటున్నారు మెదక్ జిల్లా సంయుక్త పాలనాధికారి నగేష్.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments