Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ లేకపోతే జరిమానా తప్పదు : నల్లగొండ ఎస్పీ

Webdunia
గురువారం, 9 జులై 2020 (16:51 IST)
కోవిడ్ - 19 నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించకపోతే జరిమానాలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ. ఏ. వీ. రంగనాథ్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని, బయటికి వచ్చే సమయంలో విధిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాస్కులు ధరించకుండా బయటికి వచ్చే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించని పలువురికి జిల్లా వ్యాప్తంగా జరిమానాలు విధించడం జరిగిందని చెప్పారు. కరోనా కేసులు జిల్లాలో పెరిగిపోతున్న క్రమంలో ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ తెలిపారు.

ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మాస్కులు ధరించని 599 మందికి జరిమానాలు విధించడం జరిగిందని ఆయన తెలిపారు.

జిల్లాలోని  ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, బయటికి వస్తే మాస్క్ విధిగా ధరించాలని, కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్న పోలీస్, వైద్య శాఖ, సానిటరీ సిబ్బందితో ప్రజలంతా సహకరించాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments