Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు రూ.10 వేల కోట్లు వచ్చినా భరిస్తాం: కేసీఆర్

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:41 IST)
సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారని, కానీ అదే కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తోందని వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల బిల్లు వచ్చినా భరిస్తామని స్పష్టం చేశారు. ఇతర అంశాల గురించి మాట్లాడుతూ, 9 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్ సీఐకి అందించామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతు బీమా మాదిరిగా చేనేత కార్మికులకు రూ.5 లక్షల చొప్పున బీమా అందిస్తున్నట్టు వివరించారు. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకువస్తామని చెప్పారు.

రూ.10 వేల కోట్లతో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. త్వరలో 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛను మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments