Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: కేటీఆర్‌

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (09:46 IST)
టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మున్సిపల్‌శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి తప్పకుండా అండగా ఉంటామని అన్నారు.

వివిధ ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్‌ బీమా సాయం అంఇంచారు. బుధవారం తెలంగాణ భవన్‌లో 80 మంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించి, వారిలో మనోధైర్యం నింపారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ వివిధ ప్రమాదాల్లో మరణించిన పలువురు నాయకులు, కార్యకర్తల కుటుంబాలను కేటీఆర్‌ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గురుకులాల్లో అడ్మిషన్‌లు కావాలని కొందరు, తమ పిల్లలకు ఉపాధి కల్పించాలని, పెన్షన్‌లు ఇప్పించాలని, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను ఇవ్వాలని పలువురు కోరారు.

వారి సమస్యలన తెలుసుకున్న మంత్రి అందరికీ సహాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. 18 కోట్లకుపైగానే ఇన్సూరెన్స్‌ కడుతున్నామని మంత్రి చెప్పఆరు. 950 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారని తెలిపారు.

ఈ కుటుంబాల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ జనరల్‌సెక్రటరీలతో పాటు ఎమ్మెల్యేలపై ఉందన్నారు. వీరందరికీ త్వరలోనే సాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments