Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆదుకుంటారని వెళితే పుర్రె పైభాగాన్ని లేపేశారు, ఆరోగ్యశ్రీ కోసం ఆరాటపడ్డారు...

Webdunia
గురువారం, 26 మే 2022 (18:51 IST)
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తన తండ్రిని బతికించాలంటూ అతడి కుమారుడు పరుగుపరుగున ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆరోగ్యశ్రీ వున్నదా అని అడిగారు. అతడు కార్డ్ తీసి చూపించాడు. అంతే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. పుర్రె పైభాగాన్ని వేరు చేసారు. తిరిగి అతికించడం చేతకాలేదు.

 
మరోవైపు పేషంట్ పరిస్థితి విషమంగా మారింది. ఇలాగే వదిలేస్తే ఆసుపత్రిలో ఎక్కడ ప్రాణం పోతుందో... చేసిన తప్పు ఎలా బయటపడుతుందో ఎలా తప్పించుకోవాలోనన్న ప్రణాళిక వేసి చకాచకా చేసేసారు. చావుబతుకుల మధ్య వున్న రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని ప్రభుత్వాసుపత్రికి తరలించేసారు. ఐతే పుర్రె పైభాగం మాత్రం ఆసుపత్రిలోనే మర్చిపోయి ఉంచేసుకున్నారు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రోగికి శస్త్ర చికిత్స చేసి తల పైభాగం వేరు చేసారు. ఐతే ఆపరేషన్ తర్వాత అతడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆరోగ్యశ్రీ సిబ్బందితో కుమ్మక్కై రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు.


ఐతే తప్పు చేసేవాడు దొరికిపోతాడని చెప్పినట్లే... రిపోర్టులో రోగిని మే 18ని చేర్పించినట్లు, చికిత్స మే 15న చేసినట్లు రాసారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments