Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం అల్లర్లలో 46 మందిపై కేసు

Webdunia
గురువారం, 26 మే 2022 (18:48 IST)
కోనసీమ జిల్లా పేరు మార్పుపై నెలకొన్న వివాదం నేపథ్యంగా జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి 46 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఎక్కువగా బీజేపీ నేతలతో పాటు కాపు ఉద్యమ నేతల పేర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఈ కేసులో మరింతమందిపై కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. 
 
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో బీజేపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచందర్ రావు కుమారుడు సంజయ్ తదితరులు ఉన్నారు. 
 
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో కోనసీమ జిల్లా ఒకటి. అయితే, ఈ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా తాజాగా మార్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఆందోళన జరిగింది. ఈ అందోళన చేయిదాటిపోవడంతో ఆందోళనకారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై దాడికి యత్నించారు. 
 
ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారంటూ మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, కోనసీమ జిల్లా వైకాపా అధ్యక్షుడు పొన్నాడ సతీశ్ ఇళ్లపై నిరసనకారులు దాడి చేసి నిప్పు అంటించారు. ఈ అల్లర్లపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటివరకు 46 మందిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments