Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

Webdunia
గురువారం, 20 జులై 2023 (13:06 IST)
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెక్కండ మండలం, మూడు తండాల రాజేశ్వరి (20)ని ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన వాకుంతోడు రమేష్‌కు ఇచ్చి ఏడాది కింద పెండ్లి చేశారు. 
 
పెళ్లి సమయంలో పది లక్షల రూపాయల క్యాష్, ఐదు తులాల బంగారం ఇచ్చారు. కొన్నేళ్లుగా పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని రమేష్ భార్యను వేధిస్తున్నాడు. దీంతో భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడ్డారు. మూడు నెలల కింద రమేష్.. రాజేశ్వరిని తీవ్రంగా వేధించి కొట్టడంతో తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అక్కడికి వెళ్లినా భర్త నుంచి వేధింపులు ఆగలేదు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన రాజేశ్వరి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments