Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిల్లర్ సంజయ్ .. గొర్రెకుంట బావి హత్యలు 9 కాదు.. 10

Webdunia
సోమవారం, 25 మే 2020 (16:12 IST)
వరంగల్ శివారు గీసుకొండ ప్రాంతంలోని గొర్రెకుంట బావిలో ఏకంగా 9 మృతదేహాలు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. 
 
అతని కిరాతక చర్యకు మక్సూద్ కుటుంబంతో పాటు బీహార్ కార్మికులు కూడా హత్యకు గురయ్యారు. నిందితుడు సంజయ్ కొన్నినెలల క్రితం మక్సూద్ కుటుంబానికి చెందిన మహిళను నిడదవోలు సమీపంలో రైలు నుంచి తోసేసి అంతమొందించాడు. ఈ విషయంలో తనను మక్సూద్ కుటుంబం నిలదీయడంతో పథకం ప్రకారం వారిని కూడా హతమార్చాడు.
 
శీతలపానీయంలో నిద్ర మాత్రలు కలిపి వారు స్పృహకోల్పోయాక గోనె సంచిలో కుక్కి ఒక్కొక్కరిని బావిలో పడేశాడు. కేవలం ఒక హత్య 9 హత్యలకు దారితీసిందన్న భయంకర వాస్తవం పోలీసులను సైతం నివ్వెరపరిచింది. బీహార్‌కు చెందిన సంజయ్ ఇంటర్నెట్‌లో వెతికి మరీ మర్డర్ ప్లాన్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
ఇదిలావుండగా, హత్యలు చేసినట్లు బిహార్ యువకుడు సంజయ్ కుమార్ యాదవ్ అంగీకరించాడు. మొత్తం 9 మందిని హతమార్చాడు. వరంగల్ పోలీసులు కాల్‌డేటా ఆధారంగా కేసును ఛేదించారు. 
 
గొర్రెకుంట బావి ఘటన మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రామన్నపేట పోతన మందిరం వద్ద శ్మశానవాటికలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకుల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఎంజీఎం మార్చురీ వద్ద శ్మశానంలో మక్సూద్, కుటుంబసభ్యుల అంత్యక్రియలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments