మునుగోడు ఉప పోరు.. డబ్బులు పంచాలంటూ మహిళల డిమాండ్

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (15:59 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 40 మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, ఈ పోలింగ్‌కు ఒక్క రోజు మందు ఈ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు రోడ్డెక్కారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. 
 
మునుగోడు ఉప ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా ఓటు వేయడానికి డబ్బులు ఎందుకు పంపిణీ చేయలేదని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. స్ధానిక వర్గాల సమాచారం మేరకు కొరటికల్ గ్రామానికి చెందిన కొంతమంది మహిళా ఓటర్లు తమకు డబ్బు ఎందుకు పంపిణీ చేయలేదని ఓ రాజకీయ పార్టీ నేతను గట్టిగా నిలదీశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ కావడంతో పోలింగ్ అధికారులు గ్రామానికి చేరుకుని వీడియోలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు ఓటర్లకు పంచేందుకు ఓ దుకాణంలో ప్యాక్ చేసి ఉంచిన చికెన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.3000 నుంచి రూ.10000 వరకు ప్రధాన రాజకీయ పార్టీలు పంపిణీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments