Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఉప పోరు.. డబ్బులు పంచాలంటూ మహిళల డిమాండ్

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (15:59 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 40 మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, ఈ పోలింగ్‌కు ఒక్క రోజు మందు ఈ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు రోడ్డెక్కారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. 
 
మునుగోడు ఉప ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా ఓటు వేయడానికి డబ్బులు ఎందుకు పంపిణీ చేయలేదని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. స్ధానిక వర్గాల సమాచారం మేరకు కొరటికల్ గ్రామానికి చెందిన కొంతమంది మహిళా ఓటర్లు తమకు డబ్బు ఎందుకు పంపిణీ చేయలేదని ఓ రాజకీయ పార్టీ నేతను గట్టిగా నిలదీశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ కావడంతో పోలింగ్ అధికారులు గ్రామానికి చేరుకుని వీడియోలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు ఓటర్లకు పంచేందుకు ఓ దుకాణంలో ప్యాక్ చేసి ఉంచిన చికెన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.3000 నుంచి రూ.10000 వరకు ప్రధాన రాజకీయ పార్టీలు పంపిణీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments