Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి రాములమ్మ షాక్... మోదీ సర్కారుకి జై... ఏం జరుగుతోంది?

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (17:15 IST)
జమ్ము-కశ్మీర్ పునర్విభజనకు గాను మోదీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఐతే ఆ పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా కశ్మీర్ పైన మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కూడా చేరిపోయారు. జమ్ము కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నానంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షాకిచ్చారు.
 
తను మాత్రమే కాదు... దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇలాగే స్పందించారంటూ చెప్పుకొచ్చారు. రాజకీయంగా విభేదాలున్నా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీ పడకూడదన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని అధిష్టానానికే రివర్స్ ఎటాక్ ఇస్తున్నారు. శత్రు దేశ కుట్రలను తిప్పి కొట్టడంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజకీయాలకతీతంగా స్పందిస్తారని సింధియా, ద్వివేదిల ద్వారా రుజువైందన్నారు.
 
ఐతే ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ సర్కారుకి మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు త్వరలో భాజపా తీర్థం పుచ్చుకునే అవకాశం వుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే విజయశాంతి స్పందించారని అనుకుంటున్నారు. మరి రాములమ్మ మనసులో వున్నదేమిటో.... ఇప్పటికైతే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా వున్నారామె.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments