Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో ఓడినా కేసీఆర్ తన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు: విజయశాంతి

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (14:30 IST)
జీహెచ్ ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కేసీఆర్ పైన ధ్వజమెత్తారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమిపాలైనా కూడా కేసీఆర్ దొరగారికి గాంభీర్యం తగ్గలేదని విమర్శించారు. దుబ్బాక ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవదూరమైన ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు.
 
ముఖ్యమంత్రి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఏదైనా అద్భుతం జరుగుతుందని ఊహిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనేక సంవత్సరాలు గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకపోవడమే ఓటమికి కారణమని తెలిపారు.
 
గత ఎన్నికల్లో కేసీఆర్ హామీలపై భ్రమలు పెంచుకున్న ఓటర్లు ఈసారి టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం నేర్పుతారని తెలిపారు. ఏది ఏమైనా ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పదవి మేసే వారికి కాకుండా పనిచేసేవారికి దక్కాలని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవమని విజయశాంతి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments