Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలం గూటికి రాములమ్మ?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (17:37 IST)
సొంతగూటికి రాములమ్మ చేరబోతుందా? బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందా అంటే అవుననే సమాధానం రాబోతుంది. సోమవారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ సమారుగా గం. 1.30 నిమిషాలు పాటు సాగింది.
 
సొంత గూటికి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించినట్టు సమాచారం. వీరిద్దరి భేటీ తరువాత బండి సంజయ్ అరెస్టును విజయశాంతి ఖండించారు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
 
దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణాలో పార్టీ పుంజుకుంటుదని బీజేపీ నేతలు ఆశ పడుతున్నారు. అధిష్ఠానం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగిన తెరాసను అడ్డుకోవడానికి భారతీయ జనతాపార్టీ అనుకూలమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటూ ఆపరేషన్ కమలంకు తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments