Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితకాల స్ఫూర్తిని మిగిల్చి సెలవంటూ వెళ్లిపోయిన మల్లు స్వరాజ్యం

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (09:55 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరోచిత పోరాటయోధురాలిగా గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు మల్లు స్వరాజ్యం ఇకలేరు. ఆమె యువతరానికి ఒక జీవితకాల స్ఫూర్తిని మిగిల్చి ఇక సెలవు అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 
 
సీపీఎం సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) మృతి చెందారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో పాటు.. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో తుది శ్వాసవిడిచారు. 
 
ఈ నెల 1వ తేదీన ఆస్పత్రిలో చేరిన మల్లు స్వరాజ్యం... కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చారు. అయితే, శుక్రవారం మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయుకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. కానీ, శుక్రవారం శనివారం రాత్రి 7.35 గంటల సమయంలో ఆమె చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. 
 
ఈమె ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో గత 1931లో జన్మించారు. తల్లిదండ్రులు చొక్కమ్మ, రామిరెడ్డి. 500 ఎకరాల భూస్వామి కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం మాక్సిం గోర్కి రచించిన అమ్మ నవల ప్రేరరణతో సామాజిక దురాచారాలపై ఉద్యమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments