Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో దారుణం - బాలికపై ఐదేళ్లుగా తండ్రి, అన్న అత్యాచారం

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (09:38 IST)
మహారాష్ట్రలోని పూణెలో ఓ అమానవీయ సంఘటన జరిగింది. కన్నబిడ్డపై ఐదేళ్లుగా కన్నతండ్రి అత్యాచారం చేస్తూ వచ్చాడు. అతనేకాదు తోడబుట్టిన సోదరుడు, తాత, మావయ్యలు కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయం స్కూల్‌లో ఉపాధ్యాయలు ఇటీవల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులందరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం పుణెలో ఉంటోంది. వీరిలో 11 యేళ్ల బాలిక స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటుంది. అయితే, ఇటీవల పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని బయటపెట్టింది. 
 
2017 నుంచి తండ్రే అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు చెప్పింది. అలాదే తన అన్న కూడా గత 2020 నుంచి ఈ నీచానికి పాల్పడుతున్నట్టు బోరున విలపిస్తూ చేపింది. వీరిదిద్దరే కాదు, తాత, మామయ్యలు కూడా ఈ తరహా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు వెల్లడించింది. 
 
దీంతో కౌన్సెలింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇది సామూహిక అత్యాచారం కాదని, నిందితులంతా వేర్వేరు సమయాల్లో ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారని పెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం