Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ టీకా ప్లీజ్.. కేంద్రానికి ఈటల విజ్ఞప్తి

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:20 IST)
కరోనా టీకా అందరికీ అందేలా చూడాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడి నుంచి నిత్యం తెలంగాణకు రాకపోకలు జరుగుతూ ఉంటాయని తెలిపారు.

మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితోనే తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి కో మార్బిడిటీస్‌ ఉన్న వారికి, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చామని తెలిపారు.

కానీ, అందరికీ టీకా ఇచ్చినప్పుడు మాత్రమే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సాధ్యమవుతుందని చెప్పారు. వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
 
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో 20 పడకలు దాటిన అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా వేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 20 పడకలు దాటిన ప్రైవేటు ఆస్పత్రులు 4000 వేల వరకు ఉంటాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments