Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ ఫొటోస్ దిగుతూ నీటిలో పడిన ఇద్దరు యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (07:46 IST)
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సోదరులిద్దరు సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ప్రమాదవశాత్తు తమ్ముడు నీటిలో పడిపోగా.. కాపాడేందుకు అన్న దూకాడు. వీరిలో అన్న గల్లంతు కాగా.. తమ్ముడిని పోలీసులు, నీటిపారుదల సిబ్బంది సురక్షితంగా కాపాడారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సోహైల్‌(25), మహ్మద్‌ సైఫ్‌ ఆదివారం సింగూరు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు మహ్మద్‌ సైఫ్‌ నీటిలోకి జారిపడ్డాడు. తమ్ముడిని రక్షించేందుకు నీళ్లలో దూకిన సోహైల్‌ గల్లంతయ్యాడు.

సైఫ్‌ ఈదుకుంటూ గేట్లవద్దకు చేరుకోవడంతో స్థానికులు, పుల్కల్‌ మండల పోలీసులు, నీటిపారుదలశాఖ సిబ్బంది తాడు సహాయంతో బయటికి లాగారు.

గల్లంతైన సోహైల్‌ ఆచూకీ కోసం మునిపల్లి, పుల్కల్‌ మండలాల పోలీసులు గత ఈతగాళ్లతో గాలించారు. ఆదివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదని మునిపల్లి ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments