Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ హత్య కేసు.. ఆ ముగ్గురిపై మరో రెండు కేసులు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (17:41 IST)
మిర్యాలగూడ ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పరువు కోసం ప్రణయ్‌ని హత్య చేయించిన అమృతవర్షిణి తండ్రి ప్రస్తుతం జైలులో వున్నాడు. ప్రణయ్ హత్య కేసు కారణంగా జైలులో ఉన్న అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్, కరీంలపై మరో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టును హాజరు పరిచారు.
 
ఈ కేసుల వివరాలకు వస్తే.. ప్రణయ్ బంధువులైన కోడిరెక్క అశోక్‌ను ఆగస్ట్ 6వ తేది, ఎర్రమళ్ల దినేష్‌ను ఆగస్ట్ 11వ తేది వారి కార్యాలయానికి పిలిపించి ప్రణయ్ కదలికలు మాకు తెలియజేయాలని, వారి సంబంధాలు వదిలేసుకోవాలని అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్, కరీంలు బెదిరించారు.
 
ఈ విషయంపై ప్రణయ్ బంధువులు తిరస్కరించడంతో వారిని హతమార్చుతామని బెదిరించారు. దాంతో అశోక్, ఎర్రమళ్ల దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముగ్గురి నిందితులను కోర్టులోనికి ప్రవేశపెట్టారు. కేసును విచారించిన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నిందితులను అక్టోబర్ 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Balakrishna: థమన్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ (video)

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments