తెలంగాణాలోని ఆంధ్రా ప్రయాణికులకు శుభవార్త

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (09:01 IST)
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే ఆంధ్రా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆ ర్టీసీ) శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ కోసం తమ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్రా ప్రయాణికుల కోసం పది స్లీపర్ బస్సులు బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. వీటిలో నాలుగు పూర్తిస్థాయి స్లీవర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నారు. 
 
ఈ బస్సులను హైదరాబాద్ నగరం నుంచి కాకినాడ, విజయవాడ మధ్య నడుపనున్నట్టు తెలిపింది. తొలి బస్సు బుధవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్ నుంచి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజీరెడ్డి గోవర్థన్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీవీ సజ్జనార్‌లు ప్రారంభిస్తారు.
 
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు మియాపూర్ నుంచి ప్రతి రోజూ ఉదయం 9.30, 10.45, 11.45, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15, అర్థరాత్రి 12.00, 12.45 గంటలకు బయలుదేరుతాయి. 
 
అలాగే, హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రతి రోజూ 7.75, 8.30 గంటలకు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.15, 7.45 గంటలకు బయలుదేరుతాయని తెలంగాణ ఆర్టీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments