ఫిబ్రవరిలో మేడారం జాతర - సిద్ధమవుతున్న ఆర్టీసీ

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగల్లో మేడారం జాతర ఒకటి. వచ్చే యేడాది ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగనుంది. ఈ జాతర కోసం దాదాపు 21 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా. దీంతో ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుంది. ఇందుకోసం ఏకంగా 3845 ఆర్టీసీ బస్సులను నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఒక్క వరంగల్ రీజియన్ నుంచి ఏకంగా 2250 బస్సులు నడుపనున్నారు. 
 
అంతేకాకుండా, రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు ఏపీలోని పలు జిల్లాల నుంచి కూడా ఈ బస్సులను నడుపనున్నారు. అయితే, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడుపనున్నారు. మేడారం జాతర కోసం నడిపే బస్సులను పార్కింగ్ చేసేందుకు వీలుగా 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తున్నారు. అలాగే, ప్రయాణికులు రద్దీ లేకుండా ఉండేందుకు వీలుగా భారీ సంఖ్యలో టిక్కెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం పనులను బుధవారం నుంచి ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments