Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త - నిజామాబాద్ టు తిరుమల డైరెక్ట్ సర్వీస్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:38 IST)
తెలంగాణ రవాణా సంస్థ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా, నిజామాబాద్ నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే శుభవార్త. ఈ రెండు ప్రాంతాల మధ్య శుక్రవారం నుంచి డైరెక్ట్ బస్సు సర్వీసుని ప్రారంభించింది. ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు బస్సు టిక్కెట్‌తో పాటు రూ.300 శీఘ్ర దర్శన టోకెన్‌కు అందజేస్తారు. నిజామాబాద్ నుంచి తిరుపతికి ఒక బస్సు, తిరుపతి నుంచి తిరుమలకు మరో బస్సులో తీసుకెళతారు. 
 
తిరుమలలో ఉదయం 10 గంటలకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. అయితే, ఈ బస్సులో ప్రయాణించాలంటే కనీసం వారం రోజుల ముందుగా తమ టిక్కెట్లను www.tsrtconline.in అనే వెబ్‌సైట్‌లో రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ తరహా ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments