దినదిన గండంగా ఆర్టీసీ ప్రయాణం : బస్సు బోల్తాపడి 30 మందికి గాయాలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (16:10 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలనే ప్రాణాలపై ఆశలు వదిలేసుకుని బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ధవళేశ్వరం వంతెనపై వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయపటపడ్డారు. 
 
ఈ ఘటనను మరచిపోకముందే తెలంగాణా రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మరో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 30 మంది ప్ర‌యాణీకులకు తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు సమాచారం. 
 
ఈ ఘ‌ట‌న మ‌ర్ప‌ల్లి మండ‌లం క‌ల్కొడ వ‌ద్ద శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం జ‌రిగింది. సంగారెడ్డి నుంచి తాండూరు వైపు వెలుతున్న ఆర్టీసీ బ‌స్సు క‌ల్కొడ వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 60 మంది ప్ర‌యాణీకులు ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిలో దాదాపు 30 మంది ప్ర‌యాణీకుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి.
 
స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను మ‌ర్ప‌ల్లి ఆస్ప‌త్రి త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం మ‌ర్ప‌ల్లి నుంచి వేర్వేరు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. 
 
ప్ర‌మాదానికి బ‌స్సు అతివేగ‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌యాణీకులు చెబుతున్నారు. మ‌ల‌సోమారం, పెద్దాపూర్‌, ఇందోల్, తాండూర్‌, స‌దాశివ‌పేట్‌, మొరంగ‌ప‌ల్లి, కొడంగ‌ల్‌, జ‌హీరాబాద్‌, ప‌ద్దేముల్, కేశారం గ్రామాల‌కు చెందిన వారు ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments