మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (10:20 IST)
తెలంగాణ రాష్ట్రం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి సబితా రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తన గన్‌మెన్ ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్ నగరంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, మంత్రికి భద్రతగా ఉన్న గన్‌మెన్లలో ఫాజిల్ తుపాకీతో కాల్చుకుని చనిపోవడం ఇపుడు కలకలం రేపుతుంది. అలాగే, ఈ ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా పరిశీలించారు. ఫాజిల్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆర్థిక సమస్యలా? కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడితో మాట్లాడిన అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments