Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే భోజనం మానేసిన పవన్‌తో బీజేపీ పొత్తు : హరీష్ రావు

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (09:46 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన ఢిల్లీలో వెలువడగానే భోజనం చేయడం మానేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భారతీయ జనతా పార్టీ చేతులు కలిపిందని భారత రాష్ట్ర సమితి నేత, మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ బీజేపీ, షర్మిలతో కాంగ్రెస్ జట్టు కట్టాయన్నారు. పవన్, షర్మిల... ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని ఆరోపించారు. ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేశానని చెప్పిన జనసేనానితో బీజేపీ ఎలా కలుస్తుందన్నారు.
 
అలాగే, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల అని, ఆమె కాంగ్రెస్ వైపు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ ఇవ్వమని కొట్లాడితే ఇవ్వడానికి అది సిగరెట్టా..? బీడియా...? అని వైఎస్ ఆనాడు అన్నాడని గుర్తు చేశారు. పైగా, తాను జీవించి ఉండగా, తెలంగాణ రాదన్నారని తెలిపారు. 
 
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని తెలిసిందని, ఓట్లు చీలవద్దనే టీడీపీ ఇక్కడ పోటీ చేయడం లేదంట అని అన్నారు. మనకు స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా, రాంగ్ లీడర్లు అవసరమా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments