ఈటెలకు అన్నం పెట్టి అ.. ఆలు నేర్పింది సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (11:43 IST)
తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసకు గుడ్‌బై చెప్పిన ఈటల ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈటల మాటల తూటాలు పేల్చుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెలకు అన్నం పెట్టి.. అ, ఆలు నేర్పింది కేసీఆర్ అని.. కానీ కేసీఆర్ బతికుండగానే ఈటెల సీఎం కావాలని ప్రయత్నించారని హరీష్ ఆరోపించారు. 
 
ఈటెల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈటెల సీఎం కావాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడినప్పుడు… ఆ వ్యాఖ్యలను ఈటల ఎందుకు ఖండించలేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బతికుండగానే ఆయన పెట్టిన రైతుబంధు పథకం దండగ అని ఈటెల అన్నారని హరీష్ మండిపడ్డారు. 
 
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏ శక్తి కూడా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేదని చెప్పారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో 100 శాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. 
 
కాగా టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం హరీష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈటెలకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఈటెలపై స్వయంగా హరీషే ఆరోపణలు చేయడంతో ఇరువర్గాల మధ్య రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments