Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గుడ్ న్యూస్.. టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (15:44 IST)
తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదలైన మొదటి 10 రోజుల పాటు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి అంగీకరించింది. 
 
అంతేకాదు తొలి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలను ప్రదర్శించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసిన రెండు రోజుల తర్వాత తెలంగాణలో ఆర్ఆర్ఆర్‌కి అనుమతించిన అదనపు రేట్లు వర్తిస్తాయి. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని థియేటర్లకు అడ్మిషన్ రేట్లకు మించి టిక్కెట్టుకు రూ. 75 పెంచడానికి అనుమతించింది. 
 
కొత్త జీవోతో థియేటర్ యజమానులు ప్రస్తుత టిక్కెట్ ధరలకు అదనంగా టిక్కెట్లను విక్రయించవచ్చు. అలాగే నగరాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మూవీ విడుదలైన తేదీ నుండి 10 రోజుల పాటు టిక్కెట్లను రూ. 236, మల్టీప్లెక్స్‌లలో రూ. 265కి విక్రయించవచ్చు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments