తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. అగ్నికి ఆహుతైన కారు

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (15:35 IST)
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. హఠాత్తుగా ఓ కారులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ కారు అగ్నికి ఆహుతైంది. కర్నూలుకు చెందిన భక్తులు కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
 
ఆ కారు ఇంజిన్ ముందు భాగంలో మొదలైన మంటలు కొద్దిసేపట్లోనే కారంతా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, కారులోని భక్తులు వెంటనే కిందకి దిగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు. మంటలను ఆర్పివేశారు.
 
ఇదిలా వుండగా తిరుపతిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాస సేతుపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుక నుండి ఢీకొట్టింది మరో కారు. ఢీ కొన్న కారు బోల్తా కొట్టడంతో ప్లైఓవర్ పై నిలిచిపోయాయి వాహనాలు. సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. కేసు నమోదు చెసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments