Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు... అలిపిరి వద్ద గంటల తరబడి వెయిటింగ్

తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు... అలిపిరి వద్ద గంటల తరబడి వెయిటింగ్
, శనివారం, 19 మార్చి 2022 (14:38 IST)
తిరుమలలో తిరిగి సాధారణ స్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు బాగా తగ్గిపోవడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. శనివారం నాడు అలిపిరి వద్ద భారీగా వాహనాలు చెకింగ్ పాయింట్ వద్ద బారులు తీరాయి.

 
వాహనాల రద్దీతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు 66,763 భక్తులు దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది. రూ. 4.29 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది.

 
మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తిరుమలలో అద్దె గదుల కొరత ఏర్పడింది. దీనితో భక్తులు పెద్దసంఖ్యలో గదుల కోసం వేచి చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌కి నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్: రేవంత్ రెడ్డి