యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి... ఢిల్లీ టూర్

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (11:01 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కేంద్రంపై పోరాటానికి దిగనున్నారు. యాసంగి ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇదే అంశంపై రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
 
ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావానికి అనుగుణంగా యాసంగిలో వరియేతర పంటల సాగును ప్రోత్సహించే అంశంపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4,200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం ధాన్యాన్ని సేకరించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పింది. దీంతో తెరాస ఎల్పీ సమావేశంలో ఇదే అంశంపై ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 
 
అదేసమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని విమర్శలు చేస్తున్నారు. అలాగే, రైతులతో కోటి సంతకాలు సేకరించాలన్న యోచనలో ఉంది. ఇక తెరాస ఎల్పీ సమావేశం తర్వాత మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కలుసుకుని యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments