రాకేష్ డెడ్ బాడీతో భారీ నిరసనలకు టీఆర్ఎస్ ప్లాన్

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (10:31 IST)
Rakesh
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మకంగా మారింది. నిరసనకారులు విధ్వంసానికి దిగగా.. రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఫైరింగ్‌లో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. 
 
సికింద్రాబాద్ ఆందోళన, కాల్పుల ఘటనకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ ది వరంగల్ జిల్లా. దీంతో వరంగల్ జిల్లాలో భారీ నిరసనలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. 
 
ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్జి పిలుపునిచ్చారు. ఇక రాకేష్ డెడ్ బాడీతో నర్యంపేటలో భారీ ర్యాలీ తీయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. వరంగల్ ఎంజీఎం నుంచి నర్సంపేట మీదుగా రాకేష్ స్వగ్రామం దబీల్ పురా వరకు ర్యాలీ తీయడానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.
 
సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే నర్సంపేట బంద్ కు ఎమ్మెల్యే పెద్ది పిలుపిచ్చారని తెలుస్తోంది. అధికార పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉదయాన్నే ఎంజీఎంకు వచ్చి రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించారు.  
 
రాకేష్ మృతిపై విచారం వ్యకం చేసిన కేసీఆర్.. 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మోడీ దుర్మార్గ విధానాలకు రాకేష్ బలయ్యాడని కేసీఆర్ ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments