Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో గులాబీ నేతలు

ntramarao
, శనివారం, 28 మే 2022 (13:42 IST)
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు ఎన్టీఆర్ శతజ‌యంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నేత‌లు హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. 
 
టీఆర్ఎస్ ఆవిర్భాంత తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో గులాబీ నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శ‌తజ‌యంతి సందర్భంగా కొంద‌రు టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.
 
టీఆర్ఎస్ ముందు నుంచే ఎన్టీఆర్‌పై సానుకూల వైఖరితో ఉంది. ఎన్టీఆర్‌కు సంబంధించి పలు అంశాలపై కూడా టీఆర్ఎస్ గతంలోనూ పలుమార్లు సానుకూలంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ గారికి నమస్కరిస్తున్నా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్