Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (13:54 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన ప్రజల అభిప్రాయల మేరకు జరగలేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెరాస పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను జారీచేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద ఈ నోటీసులను తెరాస ఎంపీలు అందజేశారు. 
 
ఏపీ విభజన బిల్లు, తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ అభ్యంతరకంగా మాట్లాడారాని అందులో పేర్కొంది. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానిచడమేనని చెప్పారు. 
 
ఈ ప్రివిలేజ్ మోషన్ నోటీసులను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తెరాస ఎంపీలు కె.కేశవరావు, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్‌లు కలిసి అందజేశారు. ఆ తర్వాత రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు వారు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments