Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందనీ ముగ్గురుని చంపేశాడు...

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన మూడు హత్య కేసుల్లోని మిస్టరీ వెలుగు చూసింది. ప్రేమ పేరుతో నమ్మించి సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఆమెతో పాటు.. కన్నబిడ్డనూ, ప్ర

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (10:38 IST)
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన మూడు హత్య కేసుల్లోని మిస్టరీ వెలుగు చూసింది. ప్రేమ పేరుతో నమ్మించి సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఆమెతో పాటు.. కన్నబిడ్డనూ, ప్రియురాలి తల్లిని కూడా హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో జరిగింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన గుడూరి జయమ్మ(50) అనే మహిళకు కుమార్తె అపర్ణాదేవి(33), కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. అపర్ణ అమ్మమ్మ ఊరు పాలకొల్లు మండలం ఉల్లంపర్రు. ఈ గ్రామానికి చెందిన రావాడ మధు హైదరాబాద్ కేపీహెచ్‌బీలో సెల్‌ఫోన్లు రిపేర్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అపర్ణ అమ్మమ్మ ఇంటికి వెళ్లివచ్చే సమయంలో మధుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 
 
అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారన్న విషయాన్ని అపర్ణ వద్ద దాచిపెట్టిన మధు.. ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఫలితంగా వీరికి పాప పుట్టింది. ప్రస్తుతం ఈ పాప వయసు ఐదేళ్లు. ఈ క్రమంలో చందానగర్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఎల్‌జీ ప్రమోటర్‌గా పనిచేస్తున్న అపర్ణ ప్రస్తుతం తన తల్లి, కుమార్తె కార్తికేయతో కలిసి జీవిస్తోంది. 
 
అయితే, రెండు రోజులుగా అపర్ణ ఉండే ఇంటి తలుపులు మూసి ఉండటంతో ఇంటి యజమాని నారాయణరావు అనుమానం వచ్చి వెనక వైపు కిటికీలో నుంచి చూడగా, హత్యకు గురైన అపర్ణ కాళ్లు కనిపించాయి. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తలుపులు పగులగొట్టి ఇంట్లోకెళ్లి చూడగా, మూడు శవాలను గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా, అపర్ణ కాల్ డేటాతో పాటు.. స్థానికంగా ఉండే సీసీ టీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. 
 
ఇందులో అసలు విషయం తెలిసింది. వెంటనే మధును అదుపులోకి తీసుకుని విచారించగా, అపర్ణతో తాను సహజీవనం చేస్తున్నానని, మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments