Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. 36 మంది మృత్యువాత

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలతో సహా మొత్తం 36 మంది మృత్యువాతపడ్డారు.

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (10:21 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలతో సహా మొత్తం 36 మంది మృత్యువాతపడ్డారు. 
 
బెంగాల్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు 56 మంది ప్రయాణికులతో సోమవారం నదియా జిల్లాలోని షికార్‌పూర్‌ నుంచి మాల్దాకు బయలుదేరింది. బాలర్‌ఘాట్‌ వంతెనపై బస్సు ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించబోయి ఘోగ్రా కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీశారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
 
ఘటనా స్థలాన్ని సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments