Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. 36 మంది మృత్యువాత

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలతో సహా మొత్తం 36 మంది మృత్యువాతపడ్డారు.

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (10:21 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలతో సహా మొత్తం 36 మంది మృత్యువాతపడ్డారు. 
 
బెంగాల్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు 56 మంది ప్రయాణికులతో సోమవారం నదియా జిల్లాలోని షికార్‌పూర్‌ నుంచి మాల్దాకు బయలుదేరింది. బాలర్‌ఘాట్‌ వంతెనపై బస్సు ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించబోయి ఘోగ్రా కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీశారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
 
ఘటనా స్థలాన్ని సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments