Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. 36 మంది మృత్యువాత

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలతో సహా మొత్తం 36 మంది మృత్యువాతపడ్డారు.

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (10:21 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలతో సహా మొత్తం 36 మంది మృత్యువాతపడ్డారు. 
 
బెంగాల్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు 56 మంది ప్రయాణికులతో సోమవారం నదియా జిల్లాలోని షికార్‌పూర్‌ నుంచి మాల్దాకు బయలుదేరింది. బాలర్‌ఘాట్‌ వంతెనపై బస్సు ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించబోయి ఘోగ్రా కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీశారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
 
ఘటనా స్థలాన్ని సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments