Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే : రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (07:52 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ జరుగనుంది. దీంతో ఆదివారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఇందులో బడ్జెట్‌లో అనుసరించాల్సిన వ్యాహాలపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో మైనార్టీల అభివృద్ధిని ప్రస్తావిస్తామన్నారు. కేవలం నలుగుర అధికారుల వద్దే 40 శాఖలు ఉన్నాయన్నారు. 
 
ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ ఆంధ్రాకు కేటాయించిన అధికారి అని, ఆయన్ను సీఎం కేసీఆర్ అట్టిపెట్టుకుని ఎనిమిది శాఖలను కట్టబెట్టారన్నారు. సుల్తానియా వద్ద ఆరు శాఖలు ఉన్నాయన్నారు. అధికారుల అండతో సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. 
 
అయితే, తన మాటలను కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు వక్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. తాను అవగాహన లేకుండా, ఊరకనే మాట్లాడటం లేదన్నారు. తెలివితక్కువగా మాట్లాడటం లేదని, ఒక పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments