Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (15:18 IST)
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఇకలేరు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 యేళ్లు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఏవోబీలోని దండకారణ్యలో ప్రాణాలు విడిచారని తెలుపుతూ మావోయిస్టు సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. 
 
తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరు. అంచెలంచలుగా ఎదిగి ప్రస్తుతం ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టు నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక  ఉద్యమానికి ఆయన ఇన్‌చార్జిగా పని చేశారు. 
 
కాగా, రాజిరెడ్డిపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదైవున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. పీపుల్స్ వార్ అగ్రనేతలతో కలిసి ఆయన పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తిలకు రాజిరెడ్డి సహచరుడు. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో నిందితుడిగా కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments