Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (15:18 IST)
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఇకలేరు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 యేళ్లు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఏవోబీలోని దండకారణ్యలో ప్రాణాలు విడిచారని తెలుపుతూ మావోయిస్టు సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. 
 
తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరు. అంచెలంచలుగా ఎదిగి ప్రస్తుతం ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టు నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక  ఉద్యమానికి ఆయన ఇన్‌చార్జిగా పని చేశారు. 
 
కాగా, రాజిరెడ్డిపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదైవున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. పీపుల్స్ వార్ అగ్రనేతలతో కలిసి ఆయన పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తిలకు రాజిరెడ్డి సహచరుడు. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో నిందితుడిగా కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments