Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:21 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి వరుసగా మాడు రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం జమాతుల్ వాద నేపథ్యంలో ఆప్షనల్ హాలిడేను ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నగరంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం పాఠశాలలు మూసివేశారు. శనివారం రంజాన్ పండుగ కావడంతో జాతీయ సెలవు దినం. ఆదివారం వారాంతపు సెలవు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. 
 
ఏపీ ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించలేక పోవడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని గతంలో తొలగించారు. ఈ యేడాది అన్ని వార్షిక పరీక్షలను సాఫీగా నిర్వహించారు. దీంతో 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. ఎంసెట్‌లో వచ్చే మార్కుల్లో 75, ఇంటర్‌ మార్కుల్లో 25 శాతం కలిపి ఎంసెట్ ర్యాంకులను కేటాయిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments