Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జలవిద్యుత్‌ కేంద్రం ఇరవయ్యేళ్ల చరిత్రలో ఇదే తొలి ప్రమాదం

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (11:38 IST)
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇక్కడ 20 ఏళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. గత నెల 17వ తేదీ నుంచి భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది.

జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు 1988లో ప్రారంభయ్యాయి. తొలిసారిగా 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత మొత్తం 6 యూనిట్లను మూడేళ్లలో పూర్తి చేశారు. ఒక్క యూనిట్‌కు 150 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ కేంద్రం మొత్తం 900 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 
 
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 870 అడుగులకు తగ్గకుండా ఉన్నంత వరకే కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఈ ప్రమాదం జరగడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంటే రోజుకు 21 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అయితే ప్రమాదం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి జల విద్యుత్‌ కేంద్రం ద్వారా అందించే 900 మెగావాట్ల విద్యుత్‌ కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments