పెళ్ళి కోసం వచ్చి కరోనాతో 50 లక్షలు ఆసుపత్రికి సమర్పించి, చివరకు?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (18:39 IST)
ఉన్నత చదువులు చదువుకుంది. అమెరికాలో ఇంజనీర్‌గా స్థిరపడింది. పెళ్ళి నిశ్చయం కావడంతో స్వదేశానికి వచ్చింది. కొన్నిరోజుల్లో పెళ్ళి సందడి మొదలు కావాల్సిన ఆ ఇంట్లో ఏడుపులతో మారుమ్రోగుతోంది. కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం ఇది.
 
పెళ్ళి చేసుకునేందుకు స్వదేశానికి వచ్చి కరోనాతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. 40 రోజుల వైద్యానికి 50 లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు నిలబడలేదని కన్నవారి ఆవేదన. అత్తారింటికి పంపాల్సిన కూతుర్ని కాటికి పంపాల్సి వచ్చిందని కన్నీళ్ళు. పెళ్ళి చేసుకుని కళ్ళ ముందు కళకళలాడుతూ తిరగాల్సిన కూతురు కాటికి చేరడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో నివాసముండే పెండ్యా రవీందర్ కుమార్తె నర్మిషరెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏడేళ్ళ క్రితం అమెరికాలో ఉద్యోగం సంపాదించింది. ఈ నెలాఖరులో పెళ్ళి ఉండటంతో రెండునెలల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. 
 
పని మీద చెన్నై వెళ్ళి వచ్చిన తరువాత కరోనా బారిన పడింది. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం పడటంతో తిరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. నలభై రోజులకు పైగా మృత్యువుతో పోరాడి రెండురోజుల క్రితం మృతి చెందింది.
 
చికిత్స కోసం 50 లక్షలకు పైగా ఖర్చు చేశామనీ, అయినా ప్రాణం దక్కలేదని నరిష్మా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నాయి. ఒక్క క్షణం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments