Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడాన్‌ కెప్టెన్‌ హార్వెస్ట్‌ శ్రేణి నాణ్యమైన, అందుబాటు ధరలలోని ఆహార పదార్థాలు

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (18:29 IST)
భారతదేశంలో అతిపెద్ద బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ఈ కామర్స్‌ వేదిక ఉడాన్‌ నేడు అసంఘటిత రంగంలోని భారీ ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కెప్టెన్‌ హార్వెస్ట్‌ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా కెప్టెన్‌ హార్వెస్ట్‌ బ్రాండ్‌ నాణ్యమైన, సరసమైన ధరలలోని ఆటా, మైదా, గోధుమలు, బియ్యం, శెనగపిండి తదితర ఉత్పత్తులు ప్రత్యేకంగా ఉడాన్‌ వేదికపై లభ్యం కానున్నాయి.
 
ఈ సందర్భంగా ఉడాన్‌ హెడ్- ఫుడ్‌ బిజినెస్‌, వివేక్‌ గుప్తా మాట్లాడుతూ, ‘‘కిరాణా స్టోర్లు నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నాణ్యమైన, సరసమైన ధరలలో ఉత్పత్తులను అసంఘటిత రంగంలోని మార్కెట్‌లలో పొందలేకపోవడం. ఈ ఫలితంగా స్థానిక రిటైలర్లు విక్రేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీనికితోడు లభ్యతననుసరించి ధరలు కూడా హెచ్చుతగ్గుదలకు లోనవుతుంటాయి. ఈ సమస్యలకు కెప్టెన్‌ హార్వెస్ట్‌ తగిన పరిష్కారం చూపగలదు. అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను సరసమైన ధరలలో అందిస్తుంది. అంతేకాదు, రైతులు, చిన్న మిల్లర్లు సైతం ఇ-కామర్స్‌ వ్యాప్తి ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు’’ అని అన్నారు.
 
రైతుల నుంచి నేరుగా సేకరించడంతో పాటుగా అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్యాకింగ్‌ చేస్తోన్న కెప్టెన్‌ హార్వెస్ట్‌ శ్రేణి ఆహారోత్పత్తులు బహుళ ఎస్‌కెయులలో లభిస్తున్నాయి. ఈ బ్రాండ్‌ తొలుత 40 నగరాలు, పట్టణాలలో లభ్యం కానుంది. అనంతర కాలంలో ఇతర పట్టణాలకు వ్యాప్తి చెందనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments