Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేల కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్: షర్మిల

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (12:45 IST)
గరీబుల కోసం మహానేత వైఎ్‌సఆర్‌ ఆలోచించారని, వారి కోసం ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టారని, తెలంగాణను అప్పుల పాలు చేసి రూ.వేల కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్‌  అని వైఎస్‌ షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చి పేదల కన్నీళ్లు చూడాలన్నారు.

కేసీఆర్‌కు ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం లేకనే కార్పొరేటు వైద్యం చేయించుకున్నారని, పేదలు సర్కారు ఆస్పత్రులకు వెళ్లాలని ఎలా చెబుతారని షర్మిల ప్రశ్నించారు.

సర్కారు వైద్యంపై నమ్మకం లేక ప్రాణాలు దక్కించుకునేందుకు చాలా మంది కార్పొరేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది రూ.లక్షలు అప్పులు చేశారని చెప్పారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే బతుకుతానో లేదోనన్న భయంతోనే సీఎం కేసీఆర్‌ యశోద ఆస్పత్రికి వెళ్లారని విమర్శించారు.

కొవిడ్‌ బారిన పడి అప్పుల పాలైన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కరోనా చికిత్సను ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చామని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని.. దిక్కుమాలిన పథకమని చెప్పిన మీరే ఆ పథకంలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పాఠశాలలను తెరవడం మంచిది కాదని, టీకా పంపిణీని వేగవంతం చేయాలని షర్మిల సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments