Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహిస్తాం: ఉత్తమ్

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (21:36 IST)
తెరాస, భాజపాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ధ్వజమెత్తారు. ఇక నుంచి రాష్ట్రంలో తెరాస, భాజపాలతో వేదిక కూడా పంచుకోబోమని ఉద్ఘాటించారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ... ప్రజలను తెరాస మోసం చేస్తోందని ఉత్తమ్​ మండిపడ్డారు.

అనుమతి ఇవ్వకపోయినా 'సేవ్​ నేషన్​... సేవ్​ కాన్సిటిట్యూషన్'​ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి తెరాస, భాజపాలతో కాంగ్రెస్​పార్టీ వేదిక పంచుకోబోదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు.

తెరాస అవకాశవాద రాజకీయాలు చేస్తూ... ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. రాహుల్, సోనియా నాయకత్వంలో సీఎఎ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందని తెలిపారు. సెక్యులర్‌ దేశం కోసం కాంగ్రెస్​ పార్టీ పోరాడుతున్నట్లు వెల్లడించారు.

మతతత్వ పార్టీలతో కలిసి పనిచేస్తున్న తెరాస... సీఏఏపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లబ్ది కోసం రాజకీయం చేయదని, రోజుకొక మాట మాట్లాడదన్నారు ఉత్తమ్​.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments