తెలంగాణ రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి - పగటి ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా, రాత్రిపూట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే రెండు రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
అలాగే, పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయని వెల్లడించింది. ఫలితంగా చలి పెరుగుతోందని పేర్కొంది. ఈశాన్య, వాయువ్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు తెలంగాణా వైపు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో పగటి వేళ పొడి వాతావరణం ఉంటుంది, రాత్రివేళ భూవాతావరణం త్వరగా చల్లబబడుతుందని ఈ కారణంగా చలి తీవ్ర పెరుగుతుందని తెలిపింది. 
 
అదేసమయంలో ఉదయం పూట పొగ మంచు కురుస్తుందని, గాలిలో తేమ సాధారణం కంటే 25 శాతం అధనంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వివరించారు. సోమవారం కుమరం భీమ్ జిల్లాలోని సిర్పూర్‌లో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, వచ్చే పది రోజుల్లో ఇది 10 కంటే తక్కువ డిగ్రీల్లో నమోదు కావొచ్చని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్‌తో పోరాడుతూ సినీ నటి మృతి

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments